
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
దసరా సంబరాలలో భాగంగా ఆదివారం శింగరాయకొండ ఎ.ఆర్. సి అండ్ జి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో కాంట్రాక్టర్ చల్లా గోపి మరియు బిగాలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సింగరాయకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నెబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక శక్తిని పెంచుతాయని, యువత మధ్య స్నేహం, ఐక్యత ఏర్పడుతుందన్నారు.
నాగసూరి వెంకట సుబ్బారావు తనవంతుగా వంతుగా షటిల్ బ్యాడ్మింటన్ కొరకు యువకులకి ఎప్పుడూ అండగా ఉంటాన్నారు.టోర్నమెంటు విన్నర్ గా బిగాలా శ్రీనివాస్ మరియు టి హనుమంతరావు లకు మొదటి బహుమతిగా 5000, రెండవ బహుమతిగా వెంకట్రావు, సయ్యద్ జిలానికు 3000, మూడవ బహుమతిగ రాజశేఖర్, శ్రీనివాసులుకు 2000,నాల్గవ బహుమతిగా అనాలా రవీంద్ర,నాగరాజులకు 1000 అందజేశారు.
కార్యక్రమానికి మెదటి బహుమతి సన్నెబోయిన శ్రీనివాసులు, రెండవ తాళ్లూరి రమేష్, మూడవ బహుమతి నాగసూరి వెంకట సుబ్బారావు, నాలుగవ బహుమతిహనుమంతరావులు ఆర్ధిక సహాయం చేయగా కాంట్రాక్టర్ చల్లా గోపి మెమోంటోలు అందించారు.క్రీడాకారులకు మధ్యాహ్నం భోజనం ప్రకీర్తి ఏర్పాటు చేయగ షటిల్ కాక్స్ కొల్లూరు అశోక్ స్పాన్సర్ చేశారు.టోర్నమెంట్ కు న్యాయ నిర్నేతగా మస్తాన్ వలి వ్యవరించారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు , షేక్ మస్తాన్ వలి, పెరుగు శ్రీనివాస్, ఎల్చురి రమేష్, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు.