
అమరావతి సెప్టెంబర్ 25 :(మన ధ్యాస న్యూస్ ) ప్రతినిధి, నాగరాజు,:////
మెగా డీఎస్సీ ద్వారా పదహారువేల మందికి ఉద్యోగ కల్పన కల్పించడం గర్వకారణం అని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. గురువారం అమరావతిలో నిర్వహించిన మెగా డీఎస్సీ 2025 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు మరియు ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. పండుగ వాతావరణం లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆనందంగా ప్రసంగించారు. డీఎస్సీ ఏర్పాటు తొలి సంతకం పై వివరనాత్మకంగా ప్రసంగించారు. మీకు ఉద్యోగాలు కల్పించి, మీ కుటుంబాలకు అండగా నిలిచానని విద్యార్థుల భవిష్యత్తును మీరు తీర్చిదిద్దాలని, సందేశం ఇచ్చారు.