Mana News, గొల్లప్రోలు/ శంఖవరం మన న్యూస్ :- శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో వేంచేసియున్నా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి 14వ వార్షికోత్సవ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయనిర్మాణ ప్రోత్సాహికులు దాసరి లోవరాజు ఆహ్వానం మేరకు సాయిప్రియసేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు & జిల్లా జనసేన వల్లీ దేసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వచ్చి వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారిని దర్శించుకొని ఆలయం నందు గలసరస్వతిదేవి,అంజనేయస్వామి వార్లను దర్శించుకుని తీర్ధప్రసాదాలు తీసుకొని 14వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుచున్న 10వ సప్తాహ మహోత్సవ భజన కార్యక్రమంలో పాల్గొని అన్నసంతర్పణకు విరాళంగా రూ:5000/-అక్షరాల {ఐదు వేల రూపాయలు} దాసరి లోవరాజుకు అందజేశారు,అనంతరం ఆలయప్రోత్సాహికులు దాసరి లోవరాజును జ్యోతుల శ్రీనివాసు పూవ్వలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించి,సాయిప్రియ సేవాసమితి జ్ఞాపికను అందజేశారు,ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ శంఖవరం గ్రామం ఆధ్యాత్మికం,చాలా అభివృద్ధి చెందిన గ్రామమని,వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయనిర్మాణం,నేటికి 14 సంవత్సరాలగా ఆలయ మహోత్సవాలు ఇంత ఘనం నిర్వహించడంలో దాసరి లోవరాజు ప్రోత్సాహం,కృషి ఎంతో ఉన్నదని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు దాసరి లోవరాజు సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహాదారుసభ్యులు మేకల కృష్ణ,దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ మాజీ చెర్మన్ కందా శ్రీనివాస్,సాయిప్రియ సేవాసమితి కోశాధికారి పేకేటి వెంకటరమణ,జ్యోతుల సీతరాంబాబు,వెలుగుల రాంబాబు తదితరులు పాల్గొన్నఅందజేశారు