


మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన పవర్ న్యూస్ రిపోర్టర్ పండరి ఇటీవల మృతి చెందారు. గౌరారం తండాకు చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ బాబు సింగ్ సోదరులు,మాజీ సర్పంచ్ సక్రు నాయక్ దంపతులు కూడా కన్నుమూశారు.బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామానికి చెందిన ఏఈఓ డోంగ్లీ బస్వరాజ్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందగా,డోంగ్లీ మండలం ధోతి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు సంగురం పటేల్ తల్లి కూడా మరణించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లి పరామర్శించి మనోధైర్యం నింపారు. ఎమ్మెల్యే వెంట పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మ రెడ్డి కృష్ణారెడ్డి, ఎన్ ఆర్ ఐ భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ రామ్ రెడ్డి,తదితరులు ఉన్నారు.