
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని కుమారి ఎస్. సాయి మనస్విని తనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చిన సందర్భంగా తాను చదివిన సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకి ఒక కంప్యూటర్ ప్రింటర్ (కెనాన్ ) ని బహుమతిగా తన గురువులైన శ్రీమతి సునీల, అర్రిబోయిన రాంబాబు ల చేతులమీదుగా ప్రధానోపాధ్యాయురాలు కె.మహాలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు రవిచంద మాట్లాడుతూ సాయి మనస్విని ఉన్నతమైన ఆలోచనలతో పూర్వ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిందనిఅభినందించారు.కార్యక్రమం లో పాఠశాల బోధన మరియు బోధనేతన సిబ్బంది పాల్గొన్నారు.