మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇటీవల అకారణంగా వైర్లు కట్ చేయడం వల్ల:వర్క్ ఫ్రం హోమ్ చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులుప్రభుత్వ కార్యాలయాలుకాలేజీలు, పాఠశాలలు కేబుల్ టీవీలు , బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.మేము తెలంగాణ రాష్ట్రంలో పుట్టి గత 20 సంవత్సరాలుగా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నాం. ఇప్పటికే చాలా నష్టపోయాం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల మరింత నష్టం వాటిల్లితే మా బ్రతుకులు రోడ్డుపై పడతాయి. మాకు వేరే వృత్తి తెలియదు" అని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేటర్లు వినతి పత్రాన్ని ఎమ్మెల్యే గారికి అందజేసి, తమ సమస్యపై ప్రభుత్వం స్పందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ:"మీ న్యాయమైన కోరికలకు నష్టం కలగకుండా ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కారం చూపుతాను" అని వారికి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కేబుల్ మరియు ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రతినిధులు గడ్డమీది లక్ష్మణ్ ముదిరాజ్, శేఖర్ రెడ్డి , లక్ష్మీనారాయణ, హనుమంతు , సాయినాథ్ దడిగే , చందు , శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు.