
మన ధ్యాస,కామారెడ్డి ( బాన్స్ వాడ )వాతావరణ శాఖ హెచ్చరించిందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.బాన్సువాడ డివిజన్ లో అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధిక వర్షపాతం కురిస్తే గ్రామస్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించి ముంపునకు గురయ్యే ప్రాంతాలు,అధికంగా ఓవర్ ఫ్లో అయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు, పాత ఇండ్లు,భవనాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తదితర అన్ని ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసి డివిజన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆమె సూచించారు. అదేవిధంగా గ్రామాలు, మండలాలు మున్సిపాలిటీల వారిగా ఎప్పటికప్పుడు పరిస్థితులను డివిజన్ జిల్లా స్థాయిలో తెలియజేయాలని ఆమె తెలిపారు.