కాణిపాకం ఆగస్ట్ 29 మన న్యూస్
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవ రోజున రాత్రి బంగారు నెమలి వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామి వారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ , ఏఎస్పీ రాజశేఖర్ రాజు, నెమలి వాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.