
మన ధ్యాస ,కావలి, ఆగస్టు 25 :*కూటమి ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే.. వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు. నెల్లూరు జిల్లా కావలి లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ....... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను వేధించాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయిస్తుందని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ ఆరోపించారు.ఈరోజు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు నమోదు చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ అరాచకాలకు అడ్డు ఎవరు ఉండకూడదన్న భావన అర్థం అవుతుందన్నారు . ఒక ఇల్లీగల్ క్వారీలో జరుగుతున్న అక్రమ దందాను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వివరాలు సేకరించేందుకు కొంతమంది అక్కడికి వెళితే దీనిపై కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు నమోదు చేయడం దుర్మార్గం అన్నారు.10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంత మంచి వారు ప్రజలందరికీ తెలుసన్నారు అక్రమ కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదన్నారు.అనంతరం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ......... ఈరోజు కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందన్నారు.ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాలు, హామీల అమలు గురించి ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు నెలవైనా కావలి పట్టణంలో కూడా ఈ విధమైన అక్రమ కేసులు బనాయించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ ఆకృత్యాలు అర్థమవుతున్నాయన్నారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై ఈరోజు అక్రమ కేసు నమోదు చేయడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కక్షపూరిత రాజకీయాలతో.. ఏ స్థాయికి దిగజారి పోతుందో అందరికీ అర్థమవుతుందన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదని.. చట్టపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్పిందే వేదం అన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తూ వైఎస్ఆర్సిపి నేతలు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి ఇంట్లో ఉన్న ఆడవారిని వేధింపులకు గురి చేయడం సిగ్గుచేటు అన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతుందని తెలిసి.. దాన్ని అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తే ఈరోజు ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు చేయడం.. చూస్తుంటే ఈ సమాజం ఎటు పోతుందా.. అన్న బాధ కలుగుతుందన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల పై పెడుతున్న అక్రమ కేసులను... చట్టపరంగా ఎదుర్కొంటూనే.. ప్రజలందరకూ తెలియజేసేలా రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లి.. ప్రభుత్వ నిరంకుశత్వ చర్యలను.. ఎండగడతామన్నారు. కావ్య కృష్ణా రెడ్డి కి.. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురించి తెలియదా.. ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకరిపై హత్యాయత్నం కు.. పాల్పడే మనస్తత్వం కలవారా ఒకసారి ఆలోచించాలన్నారు. అక్రమ మైనింగ్ చర్యలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే.. ప్రతాప్ కుమార్ రెడ్డి మనుషులను, డ్రోన్ పంపితే ఈరోజు దానిపై అక్రమ కేసు నమోదు చేయడం.. కుట్రపూరితమన్నారు.అక్కడికి వచ్చిన వారిని బెదిరించి.. వారి చేతిలో ఆయుధాలు పెట్టి..ఇది హత్యాయత్నం లో భాగంగా జరిగిందని..కేసులు నమోదు చేయడం చూస్తుంటే.. ఈరోజు టిడిపి నేతలు చేస్తున్న ఆకృత్యాలను ఎవరు అడ్డుకోకూడదు.. అన్న నియంత ధోరణిలో టిడిపి నేతలు ఉన్నారన్నారు. ఈ ఘటన జరిగిన రోజు కావలి ఎమ్మెల్యే ఊళ్లో లేరన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసని.. ఇది అక్రమ కేసరి ప్రతి ఒక్కరికి తెలుసు అన్నారు. కావలి పట్టణం ఏమైనా అటవీ ప్రాంతమా డ్రోన్లు పంపి ఆయుధాలతోహతమార్చాలనుకోవడానికి.. కావలి పట్టణం ఒక ప్రశాంతమైన పట్టణం..ఈ పట్టణంలో అలాంటి.. అవసరం ఉంటుందా.. ఆలోచించాలన్నారు. కావలి పట్టణంలో మాత్రమే కాదు నెల్లూరు జిల్లా అంతా.. అక్రమ కేసులు నమోదు సంస్కృతి.. కొనసాగుతుందని.. దీనికి తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈరోజు ఈ అక్రమ కేసులను.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తట్టుకొని నిలబడుతుందని.. అక్రమ కేసులకు బెదిరే ప్రసక్తే లేదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా.. తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తున్న అక్రమ కేసులు.. రేపు ఆ పార్టీ.. వినాశనానికి నాంది పలుకుతాయన్నారు. కూటమి ప్రభుత్వం ఎంత భయపెట్టినా.. ప్రజల పక్షాన నిలబడి పోరాటం సాగించడంలో..వైఎస్ఆర్సిపి ఎక్కడ వెనుకంజ..వేయదని.. కూటమినేతల ఆకృత్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.


