
*కేంద్ర మంత్రులను కలిసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మన న్యూస్, నెల్లూరు /ఢిల్లీ : రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసేందుకు సోమవారం వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా పార్లమెంట్ పరిధిలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర ఎంపీలతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. కేంద్రమంత్రులు జైశంకర్, జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీని కూడా మంత్రి లోకేశ్ కలిశారు. బీపీసీఎల్ రిఫైనరీ త్వరితగతిన నిర్మించేందుకు సహాకారం అందించాలని కోరారు. ఓఎన్జీసీకి చెందిన జాక్ ఆఫ్ రిగ్ కాంట్రాక్టు సాధనకు సహకరించాలని కోరారు. ఏపీలో దీపం-2 పథకానికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో లోకేశ్ సమావేశమై పలు రహదారుల విస్తరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్, ఎంపీల బృందం ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రం గట్టెక్కేందుకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా శాఖల పరిధిలో ఆంధ్రప్రదేశ్కు చేయాల్సిన సహాయం, ప్రాజెక్టుల పై లోకేష్ చర్చలు జరిపారు. కేంద్రమంత్రులు సర్బానంద సోనోవాల్, అశ్వనీ వైష్ణన్ గారిని కలిసిన లోకేష్, ఎంపీల బృందం వివిధ రైల్వే ప్రాజెక్టుల విషయమై సుధీర్ఘంగా చర్చించారు.

