మన న్యూస్: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ 30. నాడు మద్యానం ఒక వ్యక్తి దేవునిపల్లి పోలీసు స్టేషన్ కు వచ్చి తను చేసిన నేరం ఒప్పుకుంటూ తన పేరు కోదండం సాయిలు గోసంగి కాలనీ అని, చనిపోయిన వ్యక్తి తన కొడుకు కోదండం రాజు అని తెలిపినాడు. దర్యాప్తు లో బాగంగా లోతుగా విచారించగా మృతుడు కోదండం రాజు ఎటువంటి పని చేయక తాగుడు కు బానిస అయి ప్రతి రోజు మద్యం తాగి తన తండ్రి సాయిలు, తల్లి సాయవ్వ ను మరియు ఇద్దరు చెల్లెలను ఇష్టం వచ్చినట్లు తిట్టడం, కొట్టడం తో సాయిలు అతని మానసిక మరియు శారీరక వేదింపులు బరించలేక అతనిని చంపి వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందు నిమిత్తమై అతను ఒక పథకం రచించుకొని కామారెడ్డి కి చెంధీన అనిల్ అనే వ్యక్తి తో కలిసి తన కొడుకు రాజు ని చంపుటకు నిర్ణయించుకున్నాడు. అంధుకు అనిల్ కు ఒక లక్ష రూపాయలు సుపరి మాట్లాడుకున్నాడు. వారి రివురు వేసుకున్న పథకం ప్రకారం తేదీ 29. నాడు రాత్రి 9గంటలకు మృతుడు రాజు కు ఫుల్లుగా మద్యం తాగించి స్పృహ లేకుండా చేసి అతనిని అనిల్ యొక్క మోటార్ సైకల్ పై తీసుకొని వెళ్ళి ఉగ్రవాయి శివర్ లోని SH-11 కు కొద్ది దూరం లో వ్యవసాయ భూమి లో అతని గొంతు చుట్టూ టవల్ తో ఊరి గా వేసి అతన్ని ఊపిరాడకుండా చేసి చంపి శవాన్ని అక్కడే ఉంచి పారిపోయినారు, ఇట్టి విషయమై ఇద్దర్ని పట్టుకొని అరెస్టు చేయగా, వారు చేసిన నేరం ఒప్పుకున్నారు. తదుపరి రెండు మోటార్ సైకల్ లు మరియు రెండు ఫోన్ లు స్వాదినపర్చుకొనైనది.
ఇట్టి కేసు దర్యాప్తుల పాల్గొని 24 గంటల్లో మర్డర్ కేసుని చేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, క్రైమ్ టీం సిబ్బంది రవికిరణ్, శ్రీనివాస్ గౌడ్, రాజు లను జిల్లా ఎస్పీ డి.ఎస్.పి అభినందించారు.