మన న్యూస్,తిరుపతి :- నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మంగలి వెంకటేష్ ను నియమించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం కన్వీనర్ సిబ్యాల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్తిలో వెంకటేష్ కు నియామక పత్రాన్ని సిబ్యాల సుధాకర్ చేతులమీదుగా అందుకున్నారు. అలాగే నాయి బ్రాహ్మణ సేవా సంఘం యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అత్యారపు రవి ని నియమించినట్లు చెప్పారు. అనంతరం మీడియాతో రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం కార్యవర్గాలను నియమించినట్లు చెప్పారు. మొదటి విడతగా రాయలసీమ జిల్లాలలోని యువజన కార్యవర్గాలతో పాటు నియోజకవర్గం కార్యవర్గాలను నియమించినట్లు చెప్పారు. రాష్ట్రంలో రోజురోజుకు అంతరించిపోతున్న నాయి బ్రాహ్మణ కులవృత్తిని కార్పొరేట్ సెలూన్ల చేతికి పోయితున్నాయి అనే ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలలో కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నాయి బ్రాహ్మణ యువతకు కులవృత్తిపై శిక్షణ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేతివృత్తులకు ఆదరణ కల్పించాలన్న లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నాయి బ్రాహ్మణ యువతకు కులవృత్తిపై శిక్షణ ఇచ్చేందుకు కావలసిన రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించి మాట నిలబెట్టుకున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సహకారంతో నాయి బ్రాహ్మణులకు కులవృత్తులపై ఉండాలని ఇప్పించడం జరిగిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పై నాయి బ్రాహ్మణులకు ఎవరికైనా సందేహాలు ఉంటే నా సెల్ నెంబర్ కు ఫోన్ చేస్తే మీ సందేహాలను నివృత్తి చేస్తానని సుధాకర్ పేర్కొన్నారు. సెల్ నెంబర్ 9052016928 కు సంప్రదించాలని చెప్పారు.