మన న్యూస్ , నెల్లూరు రూరల్ ,ఆగస్టు 8 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ నందు 22.20 లక్షల రూపాయల వ్యయం తో సీ.సీ. రోడ్డు మరియు సీ.సీ.డ్రైన్ నిర్మాణ పనులకు శుక్రవారం స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక 29వ డివిజన్ అభివృద్ధికి కోటి 89 లక్షల రూపాయల నిధులు కేటయించాము అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. అన్నిరకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, నెల్లూరు రూరల్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కష్టం చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి అని టీడీపీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ లు కనపర్తి గంగాధర్ సాబీర్ ఖాన్, కో క్లస్టర్ ఇంచార్జ్ తిప్పిరెడ్డి మమతారెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్.అస్లాం, నెల్లూరు రూరల్ నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు ఖాదర్ బాషా, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టి.ఎన్.టి.యు.సి. అధ్యక్షుడు జహీర్, 29 వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు గుద్దేటి చెంచయ్య, బిజెపి నాయకులు మోగరాల సురేష్, టిడిపి నాయకులు జిలాని, మౌలాలి, కుమార్, పావళ్ళ ప్రసాద్, జయరామ్, సాయి రెడ్డి, సురేష్ రెడ్డి, కమ్రుద్దీన్, మల్లేశ్వరరావు, నారాయణ, నవీన్ రెడ్డి, రెహమాన్, దస్తగిరి, దావూద్, అమర్, ఇస్మాయిల్ ఖాదరి, షాజహాన్, అబ్దుల్ రజాక్, ఆరిఫ్, ఖాదర్ భాష, నరేందర్ రెడ్డి, డాక్టర్ మొహమ్మద్, ముజీర్ అహ్మద్, అంజద్, జహీద్, కృష్ణ, అలీ, షఫీ, సల్మాన్, సికిందర్, వాజిద్, మస్తానమ్మ, రజిని, జనసేన నాయకులు చుక్కల భీమయ్య, శేషయ్య బిజెపి నాయకులు మల్లి మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.