మన న్యూస్ , టి.పి గూడూరు ,ఆగస్టు 7 :ఈ పోటీ ప్రపంచంలో మనిషి చాలా అలసిపోతాడు, రోజుకు 24 గంటలు కష్టపడుతూ బిజీ లైఫ్ ను కొనసాగిస్తూఉంటాడు .అలాంటప్పుడు వారానికి ఒకసారి విశ్రాంతి అవసరం .ఈ అవసరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో విఐపి ఫామ్ ల్యాండ్స్ తీరుస్తుంది.నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు, మండలం కొత్త కోడూరు బీచ్ కు 1/2 కిలోమీటర్ సమీపంలో వేలంగనిమాత టెంపుల్ దగ్గర 5.5 ఎకరాలలో గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ హౌస్ ప్రాజెక్టును వి.ఐ.పి ఫామ్ ల్యాండ్స్ నామకరణముతో శ్రీ సాయి లోకేష్ డెవలపర్స్ వారు చేపట్టారు.గురువారం వి.ఐ.పి ఫామ్ ల్యాండ్స్ వారు బిజినెస్ అసోసియేట్స్ లతో గెట్ టు గెదర్ నిర్వహించి పాంప్లెట్స్, లేఔట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థలో ఒకరైన పార్ట్ నర్ మోపిదేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ .....ఈ మా విఐపి ఫామ్ లాండ్స్ లో 36 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి.ఫ్రీ ఆఫ్ లాంచ్ లో అంకణం 35000 రూపాయలు మాత్రమే అని అన్నారు. అన్ని వసంతలతో ప్రశాంతమైన , ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ మా విఐపి ఫామ్ లాండ్స్ నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.ప్రతి ప్లాటుకు ,బోరు బావి, కరెంటు, చెట్లు లతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము అని తెలిపారు.ఈ విఐపి ఫామ్ ల్యాండ్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మిస్తున్నామని అన్నారు .అతి త్వరలోనే ఈ ప్రాజెక్టులో మోడల్ హౌస్ ని కూడా రెడీ చేస్తున్నాము అని తెలిపారు.ఈ ప్రాజెక్టు దగ్గరలో బకింగ్ కెనాల్ ప్రక్కన చెన్నై నుండి కలకత్తా వరకు సాగరమాల బైపాస్ రోడ్డు వస్తుంది అని అన్నారు. అలాగే మహాలక్ష్మి పురం నుండి బీచ్ వరకు డబల్ తారు రోడ్డును ప్రభుత్వం వారు నిర్మిస్తున్నారు అని అన్నారు. తరువాత శ్రీ సాయి లోకేష్ డెవలపర్స్ అధినేత కదిరి శ్రీనివాస్ మాట్లాడుతూ....... భూమి విలువ బంగారం కంటే చాలా గొప్పది. బంగారం 50 రెట్లు పెరిగితే భూమి 500 నోట్లు పెరుగుతుంది అని అన్నారు. భూమి మీద పెట్టుబడి చాలా శ్రేష్టమైనది అని అన్నారు . ఈ ప్రాజెక్టు ప్లాట్లకు కు బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా కలదు అని అన్నారు . విఐపి ఫామ్ ల్యాండ్స్ లో ప్లాట్ కలిగి ఉండటం ఒక స్టేటస్ గా భావించండి.. అని తెలియజేశారు .భవిష్యత్తులో విఐపి ఫామ్ లో నిర్మించిన మీ ఫామ్ హౌస్ ద్వారా రెంట్ వచ్చే విధంగా కూడా డిజైన్ చేస్తున్నాము అని తెలియజేశారు. అనంతరం రఘునాథ్ కమల్, డి వెంకటేశ్వర్లు (డివి) మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సంస్థ పార్ట్ నర్స్ శ్రీ సాయి లోకేష్ డెవలపర్స్ అధినేత కదిరి శ్రీనివాస్, మోపిదేవి శ్రీనివాస రావు, రఘునాథ్ కమల్, డి వెంకటేశ్వర్లు( డివి ), బిజినెస్ అసోసియేట్స్ తదితరులు పాల్గొన్నారు.