మన న్యూస్ పాచిపెంట ఆగస్టు 7:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గరిసె గుడ్డి గ్రామ పాఠశాలను వెంటనే తెరిపించాలని గిరిజనులు. ఉపాధ్యాయులు లేక మూసి ఉన్న జిపిఎస్ పాఠశాల వద్ద. నిరసన తెలుపుతున్న గిరిజనులు స్థానిక గిరిజనులైన. సూకురు పండయ్య సేవి చిన్నయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం పాఠశాల జూన్ 12 నుండి రీఓపెనింగ్ నుండి ఉపాధ్యాయుడు పూర్తిగా రాకపోవడం వలన పిల్లలంతా పొలాల చుట్టూ అడవులు, కొండలు చుట్టూ మేకల కోసం పశువుల కోసం తల్లిదండ్రులతో పాటు పోడు వద్దకు కొండల వద్దకు ఎండల్లో వానల్లో తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు చదువు పట్ల పాలకులు నిర్లక్ష్యం మానుకొని వెంటనే పాఠశాల ప్రారంభించాలని గిరిజన విద్యార్థులకు ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. జిపిఎస్ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వేరియం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు చదువు లేకుండా చేస్తే వారంతట వారే నాశనం అయిపోతారని ఇంతకన్నా ఇంకొకటి అభివృద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూసి ఉన్న పాఠశాల వెంటనే తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజన అన్ని ప్రాంతాలలో కూడా గిరిజన విద్యార్థుల పట్ల ఐటీడీఏ పీవో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టుకుని ఎక్కడ పాఠశాలలో మూతలు పడుతున్నాయో ఎక్కడ ఉపాధ్యాయులు కొరత ఉన్నదో అక్కడ విద్యారంగా అభివృద్ధి కోసం గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఇప్పటికే గిరిజన ప్రాంతంలో మూఢనమ్మకాలు సిల్లింగులు పేరుతో భూత వైద్యులను ఆశ్రయించడం శాస్త్రీయ అవగాహన లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ఉపాధ్యాయులను నియమించి గరిసిగుడ్డి గ్రామంలో మూసి ఉన్న పాఠశాల తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అవగాహన లేక తల్లిదండ్రులకు పిల్లలను తీసుకొని కొండలకు పొడి వ్యవసాయాలకు మేకల కాయడానికి తీసుకువెళ్తున్నారని వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని దీని గురించి ప్రత్యేక శ్రద్ధ అధికారులు తీసుకోవాలని గిరిజన బ్రతుకుల్లో వెలుగు నింపాలని సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు కోరారు, ఈ కార్యక్రమంలో గరిసెగుడ్డి గ్రామ గిరిజన ప్రజలు పాల్గొన్నారు.