మన న్యూస్ :తిరుపతి :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఔట్ సోర్సింగ్ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ (అప్కాస్ ) ను రద్దు చేయాలనీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నాడని, ఆ ఆలోచన విరమించుకోవాలని వై ఎస్ ఆర్ టి యు సి జోనల్ ఇంచార్జి నారపరెడ్డి రాజారెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి లో సప్తగిరి నగర్ లో వై ఎస్ ఆర్ టి యు సి నగర ముఖ్యల సమావేశం నగర అధ్యక్షులు ఎస్. రాజా* ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశం లో ముఖ్య అతిథి గా పాల్గొన్న నార పరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ప్రయివేట్ ఏజెన్సీల ద్వారా వివిధ రంగాలల్లో ఔట్ సోర్సింగ్ కార్మికులు పెట్టి వారికీ ఇచ్చే వేతనంలో మధ్య వర్థులు కమిషన్ తీసుకొనే వారని దాని వలన కష్ట పడే కార్మికులకు అన్యాయం జరిగేదని దానిని ప్రతి పక్షం లో ఉన్నపుడు చేసిన పాదయాత్ర సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో కి కార్మికులు తీసుకోని వస్తే, అధికారం లోనికి వచ్చిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి ఏజెన్సీ వ్యవస్థ ను రద్దు చేసి అప్కాస్ ను తీసుకోని వచ్చి కార్మికులు తన కష్టపడిన జీతం నుండి కమిషన్ ఇచ్చేది రద్దు కాబడి పూర్తి జీతం వస్తే సంతోషం వ్యక్తం చేసారని అన్నారు. మరలా చంద్రబాబు అధికారం లోనికి వచ్చిన వెంటనే అప్కాస్ ను రద్దు చేస్తామని ప్రకటించడం కార్మికులకమోసం చేయడమేనని అన్నారు. వైయస్సార్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి ఈ తిరుమలరెడ్డి మాట్లాడుతూ టీటీడీ లో పనిచేసే ఔట్ సోర్సింగ్ కార్మికుల నందరిని లక్ష్మి శ్రీనివాస కార్పొరేషన్ లో చేర్చాలని వారికీ జీతం 18 వేలు పెంచాలని అన్నారు. ఆప్కాస్ ను రద్దు చేస్తే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి ఆప్కాస్ ను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ రఫీ, ఏ. యుగంధర్, గురుసాయి, నితిన్, జగదీష్, చక్రి, దయసాగర్ తదితరులు పాల్గొన్నారు.