సతాబి గిరిజనులు ఆందోళన
మన న్యూస్ పాచిపెంట ఆగస్ట్ 4:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో సతాబి గిరిజన గ్రామం లో హైడ్రో ప్రాజెక్టు సిబ్బంది వేసిన సర్వే రాళ్లు వలనతీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్ని రామయ్య శిల్పజన్ని శ్రీరామ్ గ్రామ సర్పంచ్ శిల్పజన్ని రామయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులను భయభ్రాంతులను చేసే విధంగా గిరిజన ప్రాంతాల్లో సతాబి నుంచి విశాఖ జిల్లా గుమ్మ కోట గుజ్జల నుండి సింగవరం డబుల్పాడు మరియు పాచిపెంట మండలం సంబంధించినటువంటి బుర్ర మామిడి జిలకవలస తంగలం పరిధిలో మొత్తం ఆరు పంచాయతీలు పరిధిలో సర్వేరాలను వేసి హైడ్రో కొంతమంది సిబ్బంది సర్వేరాలు వేసి వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సర్వేరాలు వద్ద ఆదివాసి గిరిజన సంఘం ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదని ప్రకృతి వనరులను అపారమైన ఖనిజ సంపదను కొల్లగొట్టే విధంగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అండగా ఉంటూ ఇటువంటి విధానాలను తీసుకొస్తుంది సర్వేరాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు అలాగే అటువై హక్కులు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాలు చొప్పున పట్టాల మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జీవో నెంబర్ త్రీ ని కొనసాగించాలని గిరిజనులకు స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని వీసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గిరిజనులు ఆదివాసి గిరిజన సంఘం నాయకులు జె సుబ్రమణ్యం అల్పజన్ని అప్పలస్ స్వామి గిరిజన యువత మహిళలు పాల్గొన్నారు. వెంటనే సర్వే రాళ్లను తొలగించి గిరిజన ప్రాంతంలో భయభ్రాంతులను చెందే విధంగా గురి చేసే విధంగా ఉండొద్దని హైడ్రో ప్రాజెక్టు అనే కాదు గిరిజన ప్రాంతంలో కనీసం తరలించే ఆలోచనలు మానుకోవాలని సతాబి మరియు పాచిపెంట మండలం సంబంధించిన గిరిజనులందరికి భరోసా ఇవ్వాలని భవిష్యత్తు పోరాటాలకు ప్రభుత్వాలే బాధ్యత పడాలని తెలిపారు. గిరిజనులు ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.