కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు,):
కలిగిరి మండలం తూర్పు గుడ్లదోన గ్రామానికి చెందిన వాసిపల్లి మదన్మోహన్ రెడ్డి మాధవి లత దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మనీషా రెడ్డి గంధపు నలుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని నవవధువును అక్షంతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం బంధుమిత్రులతో కొద్దిసేపు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు, రావులకొల్లు సర్పంచ్ పివి నాయుడు, సుబ్బారెడ్డి ఇతర నాయకులు బంధుమిత్రులు తదితరులు ఉన్నారు.