సత్ప్రవర్తన విద్యార్థి ఎదుగుదలకు సోపానం
బాల బాలికలు కలిసి చదువుకోవడం కుటుంబ వాతా వరణాన్ని గుర్తు చేస్తుంది
మన న్యూస్ సింగరాయకొండ:-
విద్యార్థి దశ జీవితంలో ఎంతో ముఖ్య మైనదని అక్కడి నుండి సత్ప్రవర్తన, సంస్కారం తో పాటు ఎదుగుదలకు సోపానంగా లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగాలని సింగరాయకొండ ఎస్సై బి మహేంద్ర పిలుపు ఇచ్చారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు చట్టాలు, నేరాలు పట్ల గీతం విద్యాసంస్థల లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గీతం విద్యాసంస్థల నిర్వాహకుడు లక్ష్మణ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మహేంద్ర అవగాహన కల్పిస్తూ సమాజం లో అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకునే వాళ్ళ తో పాటు దుర్వినియోగం చేస్తూ జీవితాలను పాడు చేసుకుంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞానం మంచికి ఉపయోగ పడాలి కానీ సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం, చెడు ప్రవర్తనకి దారి తీస్తుందని ప్రత్యేకంగా విద్యార్థులు చెడు మార్గానికి దారి తీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుండి విద్యార్థిని విద్యార్థులు సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని జీవితాలను ఉత్తమ మార్గం వైపు తీర్చి దిద్దుకోవాలి ఆయన కోరారు. సమాజంలో చోటు చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు, నేరాలు,మాదక ద్రవ్యాల రవాణా చెలామణి, వినియోగం గురించి అవగాహన చేసుకుంటూ మంచి మార్గం లో ముందుకు సాగాలని మహేంద్ర కోరారు. ఈ సందర్భంగా గీతం విద్యాసంస్థల నిర్వాహకుడు లక్ష్మణ రావు మాట్లాడుతూ విద్యార్థులు సంస్కారాన్ని అలవరుచుకుంటూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని జీవితాలను ఉత్తమ మార్గం వైపు తీర్చి దిద్దుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు హితవు చెప్పారు. విద్యాసంస్థ ప్రధానోపాధ్యాయుడు తాజుద్దీన్, సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.