గూడూరు, మన న్యూస్ :- ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు లలో యాప్ లు వెంటనే రద్దు చేయాలని, పనిచేస్తున్న ప్రదేశాలలో నెట్ వర్క్ అందుబాటులో, లేకపోవడం. పలు సమస్యల పరిష్కారం కొరకై రాష్ట్ర,జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం రోజు తిరుపతి జిల్లా గూడూరులో స్థానిక ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. అంగన్వాడి వర్కర్స్ రూరల్ అధ్యక్షురాలు ఏ.ఇంద్రావతి మాట్లాడుతూ ఎఫ్.ఆర్.ఎస్ రద్దు చేయాలని, అంగనవాడి వర్కర్లపై వేధింపులు ఆపాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, అలాగే అంగనవాడి కేంద్రాలలో వై.ఫైవ్.కనెక్షన్ ఏర్పాటు చేయాలని, లేదా(జి.బి) సెల్ ఫోన్లు కు సరిపడా ఏర్పాటు చేయాలని, కనీస వేతనం పెన్షన్, సామాజిక భద్రత సదుపాయాలు, గ్రాడ్యుటీ, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.అలాగే పిల్లలకు వంట చేసేందుకు సరిపడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదని, బయట మార్కెట్లో అధిక ధరలు వెచ్చించి గ్యాస్ సిలిండర్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి పై డిమాండ్లు పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ లీడర్లు ఎస్.కె ఆసియా బేగం,జే. లక్ష్మి,పి.భారతమ్మ,ఇ.పెంచలమ్మ, బి.ప్రభావతి,కె.రోజా,అలేఖ్య, సి.ఐ.టి.యు నాయకులు జోగి.శివకుమార్,బి.వి. రమణయ్య,అడపాల ప్రసాద్, ఎంబేటి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.