గూడూరు, మన న్యూస్ :- మాస్కూల్ మాకే ఉంచాలి,స్కూల్ ను మార్చ వద్దు అంటూ పొతేగుంట అరుంధతీయ వాడలో విద్యార్థులు వారి తల్లి తండ్రులు తో కలిసి ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ నాయకులు భారీ ఎత్తిన నిరసనలు… నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పొతేగుంట అరుంధతియవాడ లో 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు పాఠశాల వున్నది,ఈ పాఠశాల లో 29 మంది విద్యార్థులు ఉన్నారు,ఇటీవల ఈ పాఠశాల లో మూడవ తరగతి పైన చదివే విద్యార్థులు ను పోతేగుంట గ్రామం లోని ప్రధాన స్కూల్ లో మెర్జ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు,కానీ ప్రస్తుతం అరుంధతీయ వాడ నుండి పోతేగుంట గ్రామం లోని ప్రధాన స్కూల్ కు వెళ్ళాలంటే సుమారు 2 కిలోమీటర్లు వరకు దూరం ఉంటుంది,చిన్న పిల్లలు రోజూ అంతదూరం వెళ్లాలంటే మద్యలో చెట్లూ సరైన రోడ్డు వసతి లేదు,వర్షా కాలం లో ఎండల సమయం లో పిల్లలు అంతదూరం నడుచుకుని వెళ్ళే సమయంలో ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారా పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఇదే సమయంలో గత 40 రోజులుగా మండల విద్యాధికారి తో పాటు జిల్లా కలెక్టర్ ను కలిసి విషయం తెలియజేశామని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి దీనిపైన విచారణ చేయవలసినదిగా అధికారులు ఆదేశించారు కానీ అధికారులు విద్యార్థి తల్లిదండ్రులు,గ్రామస్తుల తప్పుడు సంతకాలతో తప్పుడు నివేదికలు తయారుచేసి పై అధికారులకు పంపించారని దీని తీవ్రంగా పరిగణించి వారిపై చర్యలు తీసుకోవాలని పిల్లలు బడికి వెళ్లాలంటే అరుంధతీయ వాడలోనీ స్కూల్ కొనసాగించాలని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు MRPS జిల్లా ఇంచార్జ్ మందా వెంకటేశ్వర్ రావు, MRPS నెల్లూరు జిల్లా అధ్యక్షులు S.ఉదయకృష్ణ,MSP పార్టీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేత్కర్ తో పాటు అనుబంధ సంఘ నాయకులు,కార్యకర్తలు పోతేగుంట అరుంధతియ వాడ లోని స్కూల్ వద్దకు చేరుకొని భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు, స్కూల్ ను కొనసాగించకపోతే తమ నిరసన మరింత తీవ్రతరం చేస్తామని విద్యార్థులు తల్లిదండ్రులతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు అధికారులను కోరారు..