కావలిమనన్యూస్ : సాయిపేట మాజీ సర్పంచ్, భీమవరప్పాడు మాజీ PACS అధ్యక్షులు, నెల్లూరు జిల్లా టెలికాం సలహా సభ్యులు, INC కొండాపురం మండలం మాజీ కన్వీనర్
తాటికొండ రామమూర్తి 4వ వర్ధంతి సందర్బంగా వారి కుమారుడు కొండాపురం మండలం రెడ్క్రాస్ కన్వీనర్ మరియు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ కావలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు 54 వ సారి రక్తదానం చేసారు. ఈ సందర్బంగా కావలి రెడ్ క్రాస్ చైర్మన్ రవిప్రకాష్ మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో రక్తం అవసరమైన వారికి రక్తదాతలను ఎర్పాటుచేస్థూ ప్రాణాలను కాపాడుతున్నాడని అన్నారు.ఈ రోజు వారి నాన్న గారి 4వ వర్ధంతి సందర్బంగా 54వ సారి రక్తదానం చేయటం అభినందనీయం అని అన్నారు. తాటికొండ నవీన్ మాట్లాడుతు మా నాన్న గారి స్పూర్తితో లైఫ్ లైన్ ఫౌండేషన్ స్థాపించి మా నాన్న గారి ఆధ్వర్యం లో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించాము. ప్రతి సంవత్సరం మా నాన్న గారి వర్ధంతి సందర్భంగా వివిధ సేవాకార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు మా నాన్న గారి 4వ వర్ధంతి సందర్బంగా కావలి రెడ్ క్రాస్ నందు రక్తదానం చేసానని అన్నారు. ఈ కార్యక్రమలలో జయ ఉష స్కూల్ కరస్పాండెంట్ వెంకట్రావు మరియు రెడ్క్రాస్ సిబ్బంధి పాల్గొన్నారు