గూడూరు ,మన న్యూస్ :- ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జూలై01 తేదీన "జతీయ డాక్టర్ల దినోత్సవం" సందర్భంగా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు 7మంది ప్రముఖ డాక్టర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. సన్మాన గ్రహీతలు: . డాక్టర్ D.V. సంపూర్ణమ్మ , డాక్టర్ N. సుజిత , డాక్టర్ రమేష్ ,డాక్టర్ హరీష్ కుమార్ రెడ్డి , డాక్టర్ P. స్వాతి , డాక్టర్ హెలెన్ స్మైలేస్ ,డాక్టర్ రాజేష్ కుమార్ కు
ఘన సన్మానం నిర్వహించారు. మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే, మన జీవిత ప్రయాణంలో అనారోగ్యం చేసినప్పుడు మన ప్రాణాలను కాపాడి పునర్జన్మను ప్రసాదించే దేవుళ్ళు మన డాక్టర్లు. కావున డాక్టర్ దేవుళ్లకు "ఘన సన్మానం" జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్లు దేవుళ్ళు వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ వైద్యులు డాక్టర్ బి సి రాయ్ జయంతి సందర్భంగా 1991 నుండి భారత ప్రభుత్వం జాతీయ డాక్టర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుందని ప్రగతి సేవా సంస్థ ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే మహిళా దినోత్సవం నర్స్ డే ఘనంగా నిర్వహిస్తుందని ఇందులో భాగంగా డాక్టర్లకి సన్మానం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరిడెంట్ జరీనా బేగం, డాక్టర్ రాజా, ఆర్ ఎం ఓ ప్రసన్న, బ్లడ్ బ్యాంక్ మౌలా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు, పోతిరెడ్డి పెంచలయ్య, డిష్ నాగరాజు, తూపిలి యశ్వంత్, శీను,కృష్ణారెడ్డి, విజయ్ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.