గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల నుండి ఎంపికైన మన వాల్మీకి ఉద్యోగస్తులకు జోగులాంబ గద్వాల జిల్లా వాల్మీకి / బోయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో తేదీ 30-06-2025 సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకు గద్వాల జిల్లా కేంద్రం లో నల్లకుంట లోని వాల్మీకి భవన్ యందు సన్మాన కార్యక్రమం ఉంటుంది కావున ఇట్టి కార్యక్రమానికి సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు మరియు వాల్మీకి కుల బంధువులు అందరూ హాజరై జయప్రదం చేయాలని అలాగే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా వాల్మీకి సంఘం నాయకులు రాజోలి మండలం బి ఆర్ ఎస్ అధ్యక్షులు పచ్చర్ల శ్రీనివాసులు ఒక ప్రకటన లో తెలిపారు.