శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- మేధావులు మేధావి శక్తితో ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో విద్య అభివృద్ధికి తోడ్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు మండల కేంద్రం శంఖవరంలోని ఏపి మోడల్ స్కూల్ లో పర్వత సురేష్ చేతుల మీదుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి ప్రతి రంగాన్ని వ్యవస్థలను పునర్నిర్మాణం చేస్తూ, అభివృద్ధి సంక్షేమమే తమ అంతిమ లక్ష్యంగా పని చేస్తుందని, ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేస్తూ రాష్ట్ర పరిపాలన విభాగంలో భాగంలో ముఖ్యంగా విద్యావ్యవస్థ బలోపేతం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన, డిజిటల్ తరగతులు, నైపుణ్య శిక్షణ తరగతులను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. శంఖవరంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రత్యేక దృష్టి సాధించి అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సత్యప్రభ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో జనసేన నేత, జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యుడు మేకల కృష్ణ, ఉప సర్పంచ్ చింతనీడికుమార్, టిడిపి నేతలు బొర్రా వాసు, జల్లా శ్రీను, రౌతు శ్రీను, బొర్రా లచ్చబాబు, కనిగిరి బాడ్జి,ప్రిన్సిపాల్ వీర్రాజు, హెచ్ఎం కుర్రే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.