మన న్యూస్ సాలూరు జూన్ 27:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ని, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకముగా, పంచ వృత్తుల విశ్వబ్రాహ్మణb సంఘం అధ్యక్షులు చెరుకూ ఈశ్వరరావు, అధ్యక్షులు బి రంగాచారి, ప్రధాన కార్యదర్శి టి అనంత ఆచారి, కోశాధికారి ఎన్ శంకర్రావు ,వర్కింగ్ ప్రెసిడెంట్ వి కూర్మచారి, ఉపాధ్యక్షులు మురుమళ్ళ పార్వతీ దేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శ్రీను, కలవడం జరిగింది వారికి మన విశ్వబ్రాహ్మణ సమస్యలను వారికి తెలియపరచడం జరిగింది, అయితే మేము పంచ వృత్తులు చేసుకుంటూ జీవనాధారము గడుపుచున్నాము కార్పొరేట్ కంపెనీలు వచ్చి మా తాలూకా పనులు పోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని వారికి చెప్పడం జరిగినది అయితే వారి వెంటనే స్పందించి మేమైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కనుక మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని మేము చెప్పడం జరిగింది.వెంటనే వారి స్పందించి మీకు తప్పనిసరిగా కార్పోరేషన్కు నిధులు కేటాయించడం జరుగుతుంది కనుక ఆ విషయంలో మీరు భయపడవలసినటువంటి పని లేదని వారిని చెప్పినారు, కనుక మనకు చాలా ఆనందంగా ఉంది వెంటనే వారికి మన్యం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం యావన్మంది తరపున మీకు హృదయపూర్వక అభినంద అంటూ తెలియపరచడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారములు అందించినటువంటి పార్వతీపురం నియోజవర్గ శాసనసభ్యులు బోనాల విజయ్ చంద్ర మనకు చాలా సహాయం చేసినటువంటి వారికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున వారికి అభినందన లు తెలియజేసుకుంటున్న, మన్యం జిల్లా అధ్యక్షులు చెరుకూరేశ్వర రావు,