మన న్యూస్ నారాయణపేట జిల్లా :- చేసిన కష్టానికి ఒక్కరోజు కూలి డబ్బులు ఇవ్వకపోతేనే అల్లాడిపోయేకుటుంబాలు, అందులో అరకొర జీతాలు ఆర్థిక స్తోమత లేని మధ్య తరగతి కుటుంబాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూగ జీవాలకు వైద్యం అందిస్తున్న పశు సంచార. వాహన సిబ్బంది పరిస్థితి చెప్పలేనిది, తీరనిది మాకు జీతా లు ఇవ్వండి మహాప్రభో అని జీతాలు రాని సంచార వైద్య లు, వాహన సిబ్బంది వేడుకుంటున్నారు. గురువారం సందార పశు వైద్యురాలు మాట్లాడుతూ పొడి సంపద వరి రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1962 సందార పశు వైద్య వాహనాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు సిబ్బంది కొన్ని నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడు తున్నాము అన్నారు. గత ప్రభుత్వం 2017 లో పశువులకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 వాహ నాలు ఏర్పాటు చేసింది. 1962 సంచార పశు వైద్య వాహ నం ద్వారా పశువులకు సకాలంలో వైద్య సేవలు అందిం చడంతో గ్రామాల్లో పశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం గత ఏడాది 1962 వాహనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించకపోవడంతో మందుల కొరత ఏర్పడింది. ఉన్న మందులతో సిబ్బంది పశువులకు వైద్య సేవలు అందిస్తున్నాము. సిబ్బందికి సకాలంలో వేతనాలు అందడం లేదు. 1962 వాహనాల ఐలోపేతానికి నిధులు మంజూరు చేసి మందుల కొరత నివారించి సిబ్బందికి సక్రమంగా వేతనాలు చెల్లించాలని మేము కోరుచున్నాము. 2017 వ సంవత్సరం నుండి ఇంతవరకు ఎలాంటి ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదని, సమాన పనికి సమాన జీతం ఇన్వాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మాకు ఎలాంటి నిధులు కేటాయించలేదని వారు కోరారు. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని అన్నారు. సకాలంలో జీతాలు ఇచ్చి మమ్మల్ని అదుకోవాలని అన్నారు.