మన న్యూస్ ఉదయగిరి : మండల కేంద్రమైన ఉదయగిరిలో ఆవుల వీధిలో గత 20 సంవత్సరాల నుండి మా కాలనీలో పంచాయతీ కొళాయి ఉంది, కొంతమంది గత కొన్ని నెలల నుండి ఆ కులాయి ఉన్న స్థలాన్ని కొళాయిని, స్థలాన్ని,ఆక్రమించుకున్నారు కొళాయి నీరు లేక పక్క వీధికి వెళ్లి తెచ్చుకుందాం అంటే వాళ్లు మాకు నీళ్లు చాలడం లేదు రావద్దని పక్క వీధి వాళ్లు కూడా అంటున్నారు, మమ్మలిని నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఆవుల వీధి లో నివాసం ఉంటున్న వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ వాపోతున్నారు ఈ పంచాయతీ. కొలాయి మీద సుమారు 30నుండి40.కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. పంచాయతీ అధికారులు మా బాధను అర్థం చేసుకొని మాకు కొళాయి వేపించాలని వారు ప్రాధేయ పడుతున్నారు. గతంలో ఉన్న కొళాయిని ,స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకొని, పంచాయతీ కుళాయి నీ తమ ఇంటికనకూలంగా స్థలం ఏర్పాటు చేసుకున్నారు. నీరు లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని పక్క వీధిలోకి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినప్పటికీ పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా కాలనీ వాసులకు మాకు కులాయి వసతిని కల్పించాలని కోరుతున్నారు.