ఉదయగిరి, మన న్యూస్ : ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామంలో మద్యం మత్తులో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్. గండిపాలెం వాగు నుండి అక్రమంగా అనధికారికంగా జెసిబిలను ఉపయోగించి ట్రాక్టర్లతో ఇసుకను పూడిక ఇసుకను అక్రమంగా తరలిస్తూ… ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కనీసం వాహనాలకు సరైన పత్రాలు కూడా లేకుండా లైసెన్స్ లేని డ్రైవర్ల చేత మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలకు సైతం ప్రమాదకరంగా మారుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్టీసీ బస్సు కంటికి ఖచ్చితత్వంతో కనబడుతుంది అలాంటి బస్సును కన్ను మిన్ను కానరాకుండా మద్యం మత్తులో ఢీకొట్టారంటే సామాన్య ప్రజలు నడిపే వాహనాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇలా ఎందుకు చేస్తున్నారు అనుమతులు లేకుండా ఎందుకు ఇసుకను తోలుతున్నారు అని ఎవరైనా అడిగితే వారి మీద దాడి చేయడం తిరిగి వారి మీద కేసులు పెట్టడం వీరికి అలవాటు. గట్టిగా ఎవరైనా అడిగితే అధికారులకు నెల నెల లంచాలు ఇచ్చేది తోలుకోవడానికి కదా వాగులోకి వెళ్లినందుకు జెసిబికి ట్రాక్టర్ తోలుకున్నందుకు ట్రాక్టర్ కు నెల నెల అధికారులు ముడుపులు తీసుకుంటున్నప్పుడు మమ్మల్ని ఏం చేస్తారని బహిరంగంగా మాట్లాడడం ప్రజలకు విస్మయానికి గురిచేస్తుంది . ఇరిగేషన్ శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారో… మరే రకమైన లావాదేవీలు జరిగాయో తెలియదు కానీ చర్యలు చేపట్టాల్సిన అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్ను వాగులోని రహస్య ప్రాంతంలో దాచిపెట్టి ఏమి జరగనట్టు మరమ్మత్తులు చేయిస్తున్నారని విశ్వసనీయ వర్గాల వినికిడి.డిపో మేనేజర్ జరిగిన సంఘటన మీద పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులు విచారణ జరిపి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.