మన న్యూస్ సింగరాయకొండ:-
శింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామానికి చెందిన అర్రిబోయిన బ్రహ్మయ్య (వయసు 37, యాదవ కులం)కు చెందిన ఐదు గేదెలు జూన్ 2వ తేదీన రాత్రి గుర్తుతెలియని దొంగలు షెడ్డు నుంచి దొంగిలించి పోయిన ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శింగరాయకొండ పోలీసులు విచారణ చేపట్టారు.విచారణలో ఈ కేసులో ప్రధాన నిందితులుగా వావిలేటిపాడు గ్రామానికి చెందిన బక్కమంతుల ప్రసాద్ (54, యాదవ కులం) మరియు రావినూతల కొండలరావు (49, మాదిగ, ఎస్సీ) అనే ఇద్దరిని పోలీసులు గుర్తించి, జూన్ 24వ తేదీ అర్ధరాత్రి శింగరాయకొండ ఎస్ఐ బి. మహేంద్ర అరెస్ట్ చేశారు.అనంతరం వారి వద్ద నుండి దొంగిలించిన ఐదు గేదెలను స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. రికవరీ అయిన గేదెల విలువ సుమారు రూ. 3,50,000/- గా అంచనా వేసారు.