పాఠశాలలో యూనిఫామ్. పుస్తకాల విక్రయం , విద్యా హక్కు చట్టానికి తూట్లు, -ఉదాసీన వైఖరి లో విద్యాశాఖాధికారులు - ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్
మణుగూరు, మన న్యూస్:- మణుగూరు మండల పరిధిలోని ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ పై ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. .విద్య ను వ్యాపార ధోరణితో యజమాన్యాలు వ్యవహరిస్తుండటంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోందని, ఎంతో కష్టపడి సంపాదించినదంతా పిల్లల చదువు కే ఖర్చవుతుండడంతో పేద, మధ్య తరగతి వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ ల్లో చదివించాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారని, విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టారీతిన ఫీజులు వసూళ్లు చేస్తున్నారని. తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు.. పాఠశాలల్లో ఫీజుల కు తోడు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్బుక్ లు, బస్సు ఫీజు లంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది అంటే చాలు తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయని కొంత మంది వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి పిల్లలను చదివిస్తూ అప్పుల పాలవుతున్నారని అన్నారు. మణుగూరు, మండలం లో ప్రభుత్వ విద్యాసంస్థలను మూసి వేసి ప్రైవేట్ , కార్పొరేట్ విద్యసంస్థలకు కట్టబెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వారు మండి పడ్డారు.నకిలీ బ్రోచర్ల తోటి విద్యార్థులను తల్లిదండ్రులను తప్పు దోవ పట్టిస్తూ ప్రైవేటు యాజమాన్యాలు అడ్మిషన్ల పేర్లతోటి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్ధుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారి దగ్గర ఉరంచుకొని ఫీజు కడితే ఇస్తామని లేకుంటే ఇవ్వమని విద్యార్ధుల భవిష్యత్తు దెబ్బతినేలా నడుచుకుంటున్నాయని అన్నారు. విద్యాశాఖ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్ధి, విద్యార్ధులను సమీకరించు కొని పోరాటం నిర్వహిస్తామని. గత ఏడాది కన్నా ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు 10 నుంచి 40 శాతం వరకు ఫీజులను పెంచాయని దీనికి తోడు పుస్తకాలు, నోటు పుస్తకాల రేట్లు 30 శాతం పెరగడం తల్లి దండ్రులకు అదనపు భారంగా మారిందన్నారు.. మణుగూరు, కార్పొరేట్ పాఠశాల లో అడ్మిషన్ కోసం అధిక ఫీజులు వసూలు చేయడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారని ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించకపోతే ఎన్ ఎస్ ఎఫ్ తరపున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జి ఓ నెం (1) ప్రకారం ప్రభుత్వ పాఠశాల పుస్తకాల నే ప్రైవేటు పాఠశాలల్లో వినియోగించాలని, అడ్మిషన్ ఫీజు వసూలు చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని ఆయన పేర్కొన్నారు. అడ్మిషన్ ఫీజు ఎవరైనా వసూలు చేసినట్లు
మా దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు చేపడతామని ఎం ఈ ఓ స్వర్ణ జ్యోతి తెలిపారు. ప్రవేట్ పాఠశాలల్లో యూనిఫామ్ పుస్తకాలు అమ్ముతే చర్యలు తీసుకుంటాను. ఫీజులు నియంత్రించేందుకు తల్లిదండ్రులతో కలిసి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కమిటీ లు వేయాలని సూచించారు అధిక ఫీజులు ఎవరు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఎంఈఓ హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాష్, యూత్ కార్యదర్శి గోగు సాయి, ములుగు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు బాడిస సువాస్, వంశి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.