బద్వేల్: జూన్ 24: మన న్యూస్: సేవా తత్పరుడు నిరాడంబరుడు స్నేహశీలి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా పనిచేసిన డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనాక్షి రెడ్డి కొడుకు డాక్టర్ మధుసూదన్ రెడ్డి విచ్చేసి అనంతరం డా. మీనాక్షి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయన మెడికల్ ఆఫీసర్ గా పనిచేసి బద్వేల్ ప్రాంత వాసులకు అందరికీ తెలిసిన వ్యక్తిగా సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవాడని విశ్రాంత సంఘ భవనానికి విశేషంగా కృషిచేసి ఎంతో తోడ్పడ్డాడని, ఆయన కాలములో అనేక చెట్లు నాటి వనవృక్షాన్ని పెంచినాడని వయోవృద్ధులకు రెండు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పడేసి బీపీ షుగర్ లాంటివి చెక్ చేయడం జరిగిందని వయోవృద్ధులు ఆరోగ్యంగా ఉండే విధంగా కృషి చేసిన వ్యక్తిని ఆయన సేవలు ఉద్యోగుల సంఘానికి ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు పుల్లంరాజు, ఎద్దుల రాం సుబ్బారెడ్డి,కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, కోశాధికారి గంగన్న, ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ రాణి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లపాటి పిచ్చయ్య,ఉపాధ్యక్షులు ఆనందరావు, రాఘవరెడ్డి, లక్ష్మిరెడ్డి, మహబూబ్ సాహెబ్, గ్రేసియస్ మెడికల్ ఆఫీసర్ నరసింహారెడ్డి, జయరాం రెడ్డి, లక్ష్మీనరసయ్య, కె.వి సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.