మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పాఠశాలలో ప్రారంభమై పది రోజులు గడుస్తున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాల అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ఆరోపించారు. మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలం కొంకన్వానిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థులతో మాట్లాడారు. అధికారులు పాఠ్యపుస్తకాలను ఇప్పటివరకు ఇవ్వలేదని విద్యార్థులు తెలిపారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేయాలని డిమాండ్ చేశారు.