శంఖవరం మన న్యూస్ (అపురూప్):- ప్రజల మధ్య ఆర్థిక అడ్డంకులను తొలగించి సురక్షితమైన నీరు మరియు పారిశుధ్యం పొందడం కోసం వాష్ రుణాలపై అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ మేనేజర్ కె. శ్రీనివాస్ సూచించారు.కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు నీరు పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ మేనేజర్ కె శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ మాస్ జాతీయస్థాయిలో స్వయ సహాయక సంఘాల ఉద్యమం అనే లక్ష్య సాధన కోసం 2001 ఏర్పాటైందని, పటిష్టమైన సహకార విలువలు సూత్రాలు పునాదిగా ఏర్పడిన స్వయం సహాయక సంస్థలను బలోపేతం చేస్తూ, పూర్తిగా సభ్యుల ఆధీనంలో, సభ్యుల నియంత్రణలో పనిచేసే రీతిలో వాటిని తీర్చిదిద్దడం పైన ఎపి మాస్ ప్రధానంగా దృష్టి నిలుపుతుందని, దానికోసం సంస్థాగత రేటింగ్, సామర్ధ్యాల పెంపుదల, జీవనోపాధులకు ప్రోత్సాహం, పనిశోధన, విధాన పరమైన అడ్వకసి వంటి కార్యక్రమాలు చేపబడుతుందన్నారు. ఈ క్రమంలో స్వయం సహాయక, పరస్పర ప్రయోజనం స్వీయ బాధ్యత వంటి విలువల మీద విశ్వాసం ఉన్న స్వయం సహాయక ప్రోత్సాహక సంస్థలు స్వయం సహాయక బృందాలు వాటి సమాఖ్యలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు , సహాయక సంఘాలు, గ్రామస్థాయి, పట్టణ స్థాయిలలో పనిచేసే ఇతర ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు, ప్రయివేటురంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేస్తుంది. కుటుంబాలలోని నీరు మరియు పారిశుధ్యం స్థితి గతులను మెరుగు పరచడంలో ఆర్థిక అడ్డంకులను తొలగించి, సురక్షితమైన నీరు మరియు పారిశుధ్యం పొందడం కోసం వాష్ రుణాలను అందేలా చూడడంలో స్వయం సహాయక సంఘాల వేదికలు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి కాబట్టి ఎ.పి.మాస్, వాటర్. ఆర్గ్ సంస్థతో కలిసి అవగాహన పెంపొందించే కార్యక్రమం కోసం నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత(వాష్) ను అమలు చేస్తుందన్నారు. ప్రజల మెరుగైన ఆరోగ్యం కొరకు కృషి చేయాలని వివోఎ లకు పిలుపునిచ్చారు.అనంతరం ఆంధ్ర ప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ చెరుకూరి చంద్రకళ మాట్లాడుతూ, సమాజంలో సురక్షితమైన నీరు మరియు పారిశుధ్యంపై అవగాహన పెంచడం ఎంతో అవసరమని, ప్రజల ఆరోగ్యం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సురక్షితమైన నీరు మరియు పారిశుద్ధ్యనికి ప్రధాన అవరోధాలలో ఆర్థిక వనరులు, అందువల్ల ఈ అవరోధాన్ని పరిష్కరించడానికి నీరు మరియు పారి సిద్ధ రుణాలు పై అవగాహన కల్పించాలన్నారు. ఇంటి యొక్క నీటి వసతులను మరియు మరుగుదొడ్డి సమస్యలు పరిష్కారం కోసం ఆర్థిక వనరులను సమకూర్చడానికి మరియు నిపుణుల సేవలు అందించడానికి వాటర్ క్రెడిట్ చిన్న సరసమైన సులభవంగా తిరిగి చెల్లించ గల రుణాలు పొందేలా చేస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం శ్రీనివాస్, వెంకటరమణ, క్లస్టర్ సీసీలు భారీ సంఖ్యలో వివో ఎ లు పాల్గొన్నారు.