మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) విద్యా క్షేత్రంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యం.వారు తమ కృషి, పట్టుదల,ప్రేమతో విద్యార్థుల జీవితాలను మారుస్తున్నారు. విద్య బోధించడమే కాకుండా, విలువలు నేర్పిస్తూ, సమాజానికి మంచి పౌరులను తయారుచేస్తున్నాని అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-2010 సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 16వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులు నాగరాజు, జ్యోతిరాజ్ ,నస్రిన్ లకు విద్యార్థులు లక్ష్మీనారాయణ, గౌస్,చాకలి సప్తగిరి,పుష్పలత, స్వరూప,బాలమణి లు కలిసి పూలమాల శాలువా మెమోరంటం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన మంచిని మాత్రమే విని ముందుకు సాగాలని సూచించారు.తల్లిదండ్రులను విద్యార్థులు బాగా చూసుకోవాలని అన్నారు.