మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) విద్యార్థులకు అక్షరాభ్యాసం నుంచి జీవన విజ్ఞానాన్ని బోధించే ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంటూ, నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉపాధ్యాయుల ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రక్షణ కాంత్,సుభాష్, ఆంజనేయులు లకు విద్యార్థులు పొట్టి హరీష్,గణేష్,మెహరాజ్, విజయ లు కలిసి ఉపాధ్యాయులకు పూలమాల శాలువా మెమోరండంతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎవరు కూడా మారలేదని అందరూ విద్యార్థులు చక్కగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అభినందించారు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్లే విధంగా కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు సహాయ సహకారాలు కూడా అందించే విధంగా కృషి చేస్తామన్నారు.