మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-2010 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ముందుగా ఉపాధ్యాయులను పూలు చల్లుతూ స్వాగతం పలికారు,సరస్వతి దేవి చిత్రపటం ముందు జ్యోతి సరిత టీచర్లు దీప ప్రజ్వలనం చేశారు.అనంతరం ఉపాధ్యాయులు రక్షణకాంత్ ,ఆంజనేయులు, సుభాష్,నశ్రీన్,జ్యోతి,సరిత,నాగరాజు,మాణిక్యా రావు,జ్యోతిరాజ్, లను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం విద్యార్థులను ఉపాధ్యాయులకు పరిచయాలను చేయించినానంతరం అప్పటి పాత జ్ఞాపకాలను గుర్తించుకొని ఆనందంగా గడిపారు. ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు మెమోరండంను అందజేశారు.