మన న్యూస్, నెల్లూరు : అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లుగా సాగుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.ఆదివారం నగరంలోని నవాబ్ పేట, వెంకటేశ్వరపురంలలోని పునరుద్దరించిన ఎఫ్ సి ఐ, అబ్దుల్ కలాం పార్కులను పునః ప్రారంభించారు. . ఆదివారం నాడు మంత్రి నారాయణ పుట్టినరోజు కావడంతో వెళ్లిన ప్రతిచోట "హ్యాపీ బర్త్ డే నారాయణ సార్" అంటూ చిన్నారులు ప్లే కార్డులు ప్రదర్శించారు. భారీ కేకులు కట్ చేయించి అందరికీ పంచి పెట్టారు. పుట్టినరోజైనా, పండుగ రోజైనా మంత్రి నారాయణ ప్రజలతోనే మమేకమవుతూ వారి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ వారి మధ్యలోనే ఉదయం నుండి సాయంత్రం వరకు గడపడంతో.. అభివృద్ధికి మారుపేరు మా నారాయణ అంటూ ప్రజలు జేజేలు పలకడం జరిగింది.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ1400 కుటుంబాలకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేస్తానని ఆయన అన్నారు. నిరుపేదలను నివసించే ప్రాంతాలలో అన్ని హంగులతో పార్కులను ఏర్పాటు చేస్తున్నామని.. పిల్లలు పార్కుల్లో ఆడుకుంటూ సంతోషంగా ఉండడం చూస్తుంటే సంతృప్తిగా ఉందన్నారు. ఐదు ఎకరాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సైతం త్వరలోనే ఏర్పాటు చేస్తామని.. నెల్లూరు సిటీ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలోని యువత భవిష్యత్తుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ ని కూడా స్పోర్ట్స్ కి అనుగుణంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను నడపడం చేతకాని గత ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవస్థలన్నిటినీ బ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లపాటు ప్రజల్ని మోసం చేస్తూ.. ఇచ్చిన హామీలను సైతం అమలు చేయని వైసీపీ నేతలకు తమపై విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. అరాచకాలు అక్రమ అరెస్టు ఎవరు చేశారు ప్రజలకు తెలుసని.. తప్పు చేసిన వారికి శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. వాళ్లది రాక్షస పాలనైతే తమది ప్రజా రంజికపాలనంటూ మంత్రి నారాయణ వెల్లడించారు .ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కో ఆప్షన్ నెంబర్ జమీర్,53&54 క్లస్టర్ ఇంచార్జ్ జహీర్, 54 డివిజన్ కార్పొరేటర్ షఫియా భేగం ,53 డివిజన్ కార్పొరేటర్ సుజాత ,ముజీర్ ,జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజి,పాకాల పెంచలయ్య,బాబురావు,నాగేశ్వరరావు,సురేష్,సుబ్బలక్ష్మి,మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.