మన, నెల్లూరు : ఐదేళ్లలో నెల్లూరు నగరాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీములను పక్కన పెట్టేసిందన్నారు. కోటమిట్టలో నాలుగున్నర కోటి విలువైన ఐదు స్వీపింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. దీంతో కార్పొరేషన్ లో స్వీపింగ్ మిషన్ల సంఖ్య 22 కు చేరింది. ప్రధాన వీధుల్లో మ్యానువల్ స్లీపింగ్ స్వస్తి పలుకుతూ.. రోడ్ల పరిశుభ్రత ధ్యేయంగా నెల్లూరు కార్పొరేషన్ పనిచేయబోతోంది. అవసరాన్ని బట్టి విడతలవారీగా స్లీపింగ్ మిషన్ల సంఖ్యను పెంచేలా మంత్రి నారాయణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు నెల్లూరు నగర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని.. తాను గతంలో శ్రీకారం చుట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీమును వైసిపి ప్రభుత్వం ఆపేసిందన్నారు. మా హయాంలోనే నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని.. పార్కుల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. క్లీనింగ్ మిషన్ల ద్వారా 49 రోజుల్లోనే నెల్లూరులో దుమ్ము లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, 42&43 క్లస్టర్ ఇంచార్జ్ జాఫర్ షరీఫ్, 42 డివిజన్ కోఆర్డినేటర్ మైనుద్దీన్, 42 డివిజన్ మైనార్టీ నాయకులు జాఫర్ ,కాలేశా, ఖలీల్. 43 డివిజన్ మహిళా క్లస్టర్ ఇంచార్జ్ గౌసినిస జమీర్ తదితరులు పాల్గొన్నారు.