మన న్యూస్ ,నెల్లూరు:- ఆధునికరించిన వి ఆర్ హై స్కూల్ ను మంత్రి నారాయణతో కలిసి పరిశీలించిన సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - మంత్రి నారాయణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సోమిరెడ్డి గత పాలకులు అరాచకంతో మూసివేసిన స్కూల్ ను ఓపెన్ చేసి... సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఒకే రోజులో 900 మందికి అడ్మిషన్లు ఇవ్వడం సరికొత్త రికార్డు అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పనితీరు పట్ల సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు వీఆర్ హై స్కూల్ లో మంత్రి నారాయణను మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రితో కలిసి వి ఆర్ హైస్కూల్లో చేపట్టిన ఆధునీకరణ పనులను సోమిరెడ్డి పరిశీలించారు. తరగతి గదుల్లో ఫర్నిచర్ , డిజిటల్ ఎక్విప్ మెంట్ , ప్లే గ్రౌండ్ చూసి సోమిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వీఆర్ హై స్కూల్ ను ఇప్పుడు చూస్తే దిమ్మతిరిగిపోతోందన్నారు. ఇంత అద్భుతంగా స్కూల్ రూపు దిద్దుకొంటుందని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. మంత్రి నారాయణ సార్ టేక్ అప్ చేసి పునః ప్రారంభిస్తుండడం అద్భుతమన్నారు. ప్రస్తుతం వీఆర్ హైస్కూల్ కార్పొరేట్ ని తలదన్నేలా తీర్చిదిద్దారని కొనియాడారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కల్పించటం ఓ చరిత్ర అని అభివర్ణించారు. వీఆర్ హై స్కూల్ లో చదివి ఎందరో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. వీఆర్ సీ లా కాలేజ్ ఎన్నికల్లో నిలిచి నేను పాలిటిక్స్ చేశానని మననం చేసుకున్నారు. అటువంటి స్కూల్ ను గత పాలకులు మూసివేయడం చాలా బాధ కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. అయితే నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక మూత పడ్డ స్కూల్ ని తెరిపించటం గొప్ప విషయం అని మంత్రి నారాయణ పని తీరును అభినందించారు. తాను నడిపే స్కూల్స్ కి మించి వీఆర్సిని సిద్ధం చేయటం గొప్పవిషయం అన్నారు. అదేవిధంగా 900 మంది అడ్మిషన్స్ ని ఒక్కరోజులో చేయటం అభినందనీయమని కొనియాడారు. ప్రజలు మంత్రి నారాయణకు రుణపడి ఉండాలని ఆకాంక్షించారు. పేద పిల్లల స్కూల్ కోసం పాటుపడ్డ మంత్రి కుమార్తెలకు కూడా మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.