గడ్డిఅన్నారం. మన న్యూస్ : ఎల్ బి నగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ లోని సాయి బాబా టెంపుల్ ప్రక్కన సాయి విజయ్ టవర్స్ 2వ ఫ్లోర్ లో రాఘవేందర్ వేముల నేతృత్వంలో ఈజీ టెక్నాలజీస్ సిసిటివి కార్పొరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధులుగా గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి,తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్త హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపకుడు రాఘవేందర్ వేములని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆధునిక భద్రతా పరికరాల (సిసిటివి) విస్తృత పంపిణీ చేయడంలో భాగంగా తీసుకున్న ఈ ముందడుగు అభినందనీయం అన్నారు.ఈ సందర్బంగా రాఘవేందర్ వేముల మాట్లాడుతూ ఈజీ టెక్నాలజీస్ తమ స్వంత సంస్థ అని,మన్ఫాక్చరింగ్ యూనిట్ మల్కాజ్గిరి లో ఉందన్నారు.తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ లలో తాము సిసిటివి సెక్యూరిటీ సర్వీస్లు అందిస్తామన్నారు.తాము సీసీటీవీ సేల్స్,ఇన్స్టలేషన్,సర్వీస్,ఎ ఎమ్ సి,రెంటల్స్ వంటి సర్వీస్ లు అందిస్తామన్నారు.15 సంవత్సరాల అనుభవంతో నాణ్యమైనా సర్వీస్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రమాకాంత గుప్తా, బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రవణ్ గౌడ్, శివ రామ్, గిరీష్, టీంకు తదితరులు పాల్గొన్నారు.