మన న్యూస్,తిరుపతి : తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ లోని తైక్వాండో ట్రైనింగ్ సెంటర్ లో ఆదివారం క్రీడాకారులకు ప్రమోషన్ బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రమోషన్ బెల్ టెస్ట్ కు పరిశీలకులుగా విచ్చేసిన మాస్టర్ కె.గోపి నాయుడు పర్యవేక్షణలో జరిగింది. మొత్తం 25 మందికి ప్రమోషన్ బెల్ టెస్ట్ నిర్వహించగా ఇందులో 10 మంది శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది పాల్గొని వివిధ బెల్టులు పొందడం ఆదర్శనీయమని తైక్వాండో సెంటర్ నిర్వాహకురాలు పి.గీతా తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సత్య చేతుల మీదుగా పలువురికి వివిధ బెల్టులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో కోచ్ లు భవ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.