గోపవరం: మన న్యూస్: జూన్ 15: గోపవరం మండలం బెడుసుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి తూర్పు వైపున పేకాట ఆడుతున్న ఆరు మందిని ఆదివారం ఎస్సై శ్రీకాంత్ అరెస్టు చేయడం జరిగింది. వారి వద్ద నుండి 6100 రూపాయల నగదును మరియు పేకాట ముక్కలు లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేకాటతో ప్రజల్లో ఆర్థిక, సామాజిక నష్టాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా యువకులు ఇలాంటి బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని వారు అన్నారు. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారి హెచ్చరించారు.