శంఖవరం / అన్నవరం మన న్యూస్ (అపురూప్): అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతులకు ఘననివాళులు అర్పిస్తూ వైస్సార్సీపీ ఇంచార్జి "ముద్రగడ గిరిబాబు" ఆదేశాల మేరకు అన్నవరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక పెద్ద రావి చెట్టు సెంటర్ వద్ద గల అంబేద్కర్ కూడలి నుండి మార్కెట్ లో గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ ని నిర్వహించారు. ఈ సందర్బంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం, స్థానిక సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా మాట్లాడుతూ, ఈ దుర్గటన చాలా విచారకరమైనదాని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిసిటీ వింగ్ నియోజకవర్గం అధ్యక్షులు సరమర్ల మధుబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక వైస్సార్సీపీ నేతలు వాణిజ్య విభాగం అధ్యక్షులు గణేసుల బాబ్జి, బలువు హరిబాబు, బత్తుల రవి కుమార్, బి ఎస్వి ప్రసాద్, రాయి శ్రీనివాస్, వార్డు సభ్యులు సింగంపల్లి రాము, కొండి సూరిబాబు, కాండ్రకోట రాజు కార్యకర్తలు పాల్గొన్నారు.