మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన గెడ్డం ప్రసాద్ ఇటీవల మృతి చెందాడు.ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున,జనసేన పార్టీ ఏలేశ్వరం మండల ప్రధాన కార్యదర్శి గంగిరెడ్ల మణికంఠ 5000రూపాయిలు ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి శనివారం అందజేశారు.అంతేకాకుండా భవిష్యత్తులో పిల్లల చదువుకు సంబంధించిన అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆకుల నాని పాల్గొన్నారు.