మన న్యూస్ ,నెల్లూరు రూరల్:*రొట్టెల పండుగకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.*వారానికి ఒకసారి రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తాం. నెల్లూరు రూరల్ లో జులై ఆరో తేదీ నుండి జరిగే రొట్టెల పండగ ఏర్పాట్లపై కార్పొరేషన్ కార్యాలయంలో బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ప్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్, మేయర్ స్రవంతి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ముస్లిం మతపెద్దల సహయ సహకారాలతో రొట్టెలపండుగను విజయవంతం చేస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నేను, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 10 సంవత్సరాలనుంచి ఈ రొట్టెల పండుగను నిర్వహిస్తున్నా అని రాష్ట్ర వక్ప్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్ అన్నారు.బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తారు అని రాష్ట్ర వక్ప్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్ అన్నారు.