గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13 :- జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీవో అధికారుల ఆకస్మిక తనిఖీలు..అలంపూరు శాంతినగర్ గద్వాల ప్రాంతాలలో… స్కూల్ బస్సుల పై ఆర్టీవో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ..ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు.. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులలో విద్యార్థులను చేరవేస్తున్నారనే ముందస్తు విద్యార్థుల దృష్టిని ఉంచుకొని అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ లేని మూడు బస్సులను సీజ్ చేశామని ఆర్టీవో వెంకటేశ్వరరావు వెల్లడించారు.. జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పనిసరిగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ పొందాలని.. రవాణా శాఖ ఉత్తర్వులను ఉల్లంఘించి ఫిట్నెస్ లేని వాహనాలను నడిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు..విద్యార్థుల విషయంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్య ధోరణి వీడాలన్నారు..జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్ల బస్సుల పై.. ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు…