మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మండలంలో భూభారతి రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా
అమలు చేయడానికి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి.సదస్సు ల్లో భూసమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో రెండవ రోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.ఇందులో పలువురు రైతులు ప్రజలు భూ సమస్యలపై దరఖాస్తులు పెట్టుకున్నారు.హసన్ పల్లి గ్రామంలో 68 దరఖాస్తులను స్వీకరించినట్లు తహసీల్దార్ సవాయి సింగ్ తెలిపారు.