. మన న్యూస్, నెల్లూరు రూరల్ :*రాబోయే రోజుల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం...కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.*కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు.. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవ వేడుకలు నిర్వహించిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విశిష్ఠ అతిధిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సంవత్సరకాలంలో రాష్ట్రమంతటా కూడా గుంతలు లేని రోడ్లను తయారుచేసుకున్నాము అని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇద్దరు కలసి ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా చేస్తారు. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి అని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు . గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది అని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాళాతీసినా, తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రమంతకూడా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని, అద్భుత రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర దశ, దిశా మార్చే పోలవరం ఊపందుకున్నాయని, మన బిడ్డల భవిష్యత్తుకోసం పారిశ్రామిక పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి అని రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధసంఘ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.