మన న్యూస్ సింగరాయకొండ:-
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బింగినపల్లి వైసీ నందు పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లలో భాగంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం పాఠశాల చైర్మన్ చౌటూరి అనురాధ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంకి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి గారయిన కోటపాటి నారాయణ సార్ పాల్గొని విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేసి, మీ బిడ్డలందరినీ పాఠశాలలో చర్చించి, వారికి మంచి భవిష్యత్తును కల్పించాల్సిన బాధ్యత మీదేనని తెలియజేశారు .
ప్రధానోపాధ్యాయులు బీసాబత్తిన శ్రీనివాసరావు మాట్లాడుతూ గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో తీసుకొని వస్తున్న సమూలమైన మార్పుల్లో భాగంగా నూతన బుక్స్ ప్రింటింగ్ మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లలో ఎన్నో మార్పులు చేసి విద్యార్థులకు ఆకర్షణంగా యూనిఫామ్ మంచి ప్రింటింగ్ తయారు చేశారని కొనియాడారు. మరొక ఉపాధ్యాయులు కేశవరెడ్డి జాలి రెడ్డి గారి సహకారంతో విద్యార్థులకు, కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎంసి సభ్యులకు స్వ